ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ముకశ్మీర్లో లావెండర్కు విశేషాదరణపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
09 JUN 2023 8:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లావెండర్ (మరువం వంటి సుగంధ పుష్పజాతి) సంబంధిత ప్రసంగ భాగాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్లో ఈ సుగంధ పుష్పానికి విశేష ప్రజాదరణ లభిస్తుండటంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“జమ్ముకశ్మీర్లో లావెండర్కు ప్రజాదరణ నానాటికీ పెరుగుతుండటం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఇటీవలి నా ‘మన్ కీ బాత్’ #MannKiBaat కార్యక్రమంలో ఈ అంశాన్ని నేను ప్రముఖంగా ప్రస్తావించాను. దీన్ని youtu.be/kkbQzipkqrA లో చూడవచ్చు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1931372)
Visitor Counter : 197
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam