ప్రధాన మంత్రి కార్యాలయం

ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్ ప్రెస్ వే లో 100 కిమీ మేర బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు వేయటం మీద ప్రధాన మంత్రి అభినందన


ముఖ్యమైన హైవే లో చెప్పుకోదగిన సాధనగా అభివర్ణించిన ప్రధాన మంత్రి

Posted On: 19 MAY 2023 8:10PM by PIB Hyderabad

ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్ ప్రెస్ వే లో 100 కిమీ మేర బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు వేయటం పట్ల  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ముఖ్యమైన హైవే లో ఇదొక  చెప్పుకోదగిన సాధనగా ఆయన  అభివర్ణించారు.

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కారీ చేసిన ట్వీట్ కు ప్రధాని ఈ విధంగా స్పందించారు:

“ముఖ్యమైన హైవే మార్గం లో చెప్పుకోదగిన సాధన. ఇది వేగానికి ప్రతీక. అదే విధంగా, మెరుగైన మౌలిక వసతులకోసంఆధునిక పద్ధతులు ఎంచుకోవటానికి కూడా ఇదొక ఉదాహరణ”  



(Release ID: 1927796) Visitor Counter : 86