ప్రధాన మంత్రి కార్యాలయం
మా కామాఖ్య కారిడోర్ ఒక ప్రతిష్టాత్మకకార్యక్రమం అవుతుంది: ప్రధాన మంత్రి
Posted On:
19 APR 2023 3:15PM by PIB Hyderabad
కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు శ్రీ మాహాకాళ్ మహాలోక్ కారిడోర్ ల మాదిరిగానే మా కామాఖ్య కారిడోర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాగలదన్న ఆశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ పునరుద్ధరణ పనులు పూర్తి కానున్న మా కామాఖ్య కారిడోర్ సమీప భవిష్యత్తు లో ఏ విధం గా ఉండబోయేదీ దృశ్య రూపం లో ఒక ట్వీట్ లో శేర్ చేశారు.
అసమ్ ముఖ్యమంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘మాత కామాఖ్య కారిడార్ తప్పక ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం అవుతుంది అని నేను నమ్ముతున్నాను.
ఆధ్యాత్మిక అనుభవాని కి సంబంధించినంత వరకు కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు శ్రీ మహాకాళ్ మహాలోక్ లు పరివర్తనాత్మకం అయ్యాయి. పర్యటన రంగం వృద్ధి చెందడం తో పాటు గా స్థానిక ఆర్థిక వ్యవస్థ కు అండదండ లు లభించిన వాస్తవానికి కూడా సమానమైన ప్రాముఖ్యం ఉన్నది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1918100)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam