ప్రధాన మంత్రి కార్యాలయం

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రమాదంపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 14 APR 2023 8:46AM by PIB Hyderabad

పీఐబీ ఢిల్లీ ద్వారా 2023 ఏప్రిల్‌ 14ఉదయం 8:46 గంటలకు పోస్ట్‌ చేయబడినది

   పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం మంజూరుకు ఆమోదం తెలిపారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM @narendramodi తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధినుంచి తలా ₹2 లక్షల వంతున, క్షతగాత్రులకు ₹50వేల చొప్పున మంజూరు చేసేందుకు ఆమోదించారు” అని పేర్కొంది.



(Release ID: 1916594) Visitor Counter : 106