ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒక ఆర్థిక సంవత్సరం లో ఇప్పటి వరకు చూస్తే అన్నిటికంటేఎక్కువ సరకు లోడింగు ను నమోదు చేసిన రైల్ వేలు


వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ రంగానికి మంచి కబురు అని పేర్కొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2023 10:15AM by PIB Hyderabad

రైల్ వేలు 2022-23 వ ఆర్థిక సంవత్సరం లో 1512 ఎమ్ టి సరకు లోడింగు తో పాటు ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం లో ఇప్పటివరకు పరిశీలిస్తే అన్నింటి కంటే ఎక్కువ సరకు ను లోడ్ చేసిన రికార్డు ను కూడా నమోదు చేసినట్లు రైల్ వేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలియ జేశారు.

 

రైల్ వేస్ శాఖ కేంద్ర మంత్రి చేసిన పలు ట్వీట్ ల కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ రంగానికి ఇది ఒక మంచి కబురు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1914899) సందర్శకుల సూచీ సంఖ్య : : 151