ప్రధాన మంత్రి కార్యాలయం

స్వయంచలిత పునరుపయోగ వాహకనౌక ప్రయోగంపై ‘ఇస్రో’కు ప్రధాని ప్రశంస

Posted On: 02 APR 2023 8:18PM by PIB Hyderabad

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వయంచలిత పునరుపయోగ వాహకనౌక ప్రయోగం నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత వాయుసేన, ‘డిఆర్‌డిఒ’ల సహకారంతో కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఎయిరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఎటిఆర్‌) నుంచి ఇస్రో ఈ పునరుపయోగ వాహకనౌక స్వయంచలితంగా తిరిగొచ్చే ప్రయోగాన్ని 2023 ఏప్రిల్‌ 2న ఉదయం నిర్వహించింది.

ఈ ప్రయోగంపై ఇస్రో ట్వీట్‌ల మీద స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇదొక గొప్ప సమష్టి విజయం... భారత పునరుపయోగ అంతరిక్ష వాహకనౌక తయారీ స్వప్న సాకారం దిశగా ఇది మరొక ముందడుగు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1913251) Visitor Counter : 153