ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంది: ప్రధానమంత్రి

Posted On: 25 MAR 2023 11:21AM by PIB Hyderabad

   జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీలో రూ.9400 కోట్లతో 21 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీసహా కేంద్ర రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీకి పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్ ఒక ట్వీట్‌ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ  మేరకు పార్ల‌మెంట్ స‌భ్యుడు శ్రీ సంజ‌య్ సేథ్ ట్వీట్‌పై ప్ర‌ధానమంత్రి స్పందిస్తూ:

“రాష్ట్రాల ప్రగతితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంది. ఈ జాతీయ ప్రాజెక్టులు జార్ఖండ్‌సహా మొత్తం దేశ పురోగమనానికు కొత్త ఉత్తేజమిస్తాయి” అని పేర్కొన్నారు.



(Release ID: 1910916) Visitor Counter : 140