ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విరుదునగర్ లో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు ను ఏర్పాటు చేసినందుకు తమిళనాడును అభినందించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2023 5:49PM by PIB Hyderabad

పి. ఎం. మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు ఆకాంక్షిత జిల్లా విరుదునగర్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

విరుదునగర్ లో మెగా టెక్స్ టైల్ పార్కును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిచ్చారు.

‘'తమిళనాడులోని నా సోదర సోదరీమణులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఆకాంక్షాత్మక జిల్లా విరుదునగర్ లో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు అవుతోంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు రాష్ట్ర యువతకు ప్రయోజనకరంగా ఉంటుంది.‘‘

అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

 

 

 

***

DS


(రిలీజ్ ఐడి: 1909768) సందర్శకుల సూచీ సంఖ్య : : 150