ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన బంధాన్ని గుర్తు చేసుకున్న సౌరాష్ట్ర తమిళ సంఘం: ప్రధానమంత్రి
Posted On:
19 MAR 2023 8:49PM by PIB Hyderabad
గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన కాలం నుంచీ వస్తున్న అనుబంధాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ బంధాన్ని సౌరాష్ట్ర తమిళ సంగమం ఒక వేడుకలా జరుపుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ నినాదానికి ప్రతీక అని అభివర్ణించారు.
కేంద్ర మంత్రి డాక్టర్ మన సుఖ మాండవ్యా చేసిన ట్వీట్ కు స్పందిస్తూ, ప్రధాని ఇలా రీట్వీట్ చేశారు:
"ఎస్టీ సంగమం గుజరాత్, తమిళనాడు మధ్య పురాతన బంధాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకగా జరుపుకుంటోంది. శతాబ్దాల క్రితం గుజరాత్ ప్రజలు తమిళనాడును తమ నివాసంగా మార్చుకొని అక్కడి స్థానిక సంస్కృతిలో ఒదిగిపోయారు. తమిళ ప్రజలు కూడా చేతులు చాచి ఆహ్వానించి అక్కున చేర్చుకున్నారు. ఈ సంగమం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కు నిదర్శనంగా నిలుస్తోంది.
***
DS
(Release ID: 1908658)
Visitor Counter : 145
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam