ప్రధాన మంత్రి కార్యాలయం

కష్టజీవులైన మన మత్స్యకారులకు సదా మద్దతిస్తాం: ప్రధానమంత్రి

Posted On: 10 MAR 2023 8:50PM by PIB Hyderabad

   దేశంలోని మత్స్యకారులకు ప్రభుత్వ చేయూతను సదా కొనసాగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న పునరుద్ఘాటించారు. వారి అవసరాలకు తగిన జీవననోపాధితోపాటు మెరుగైన మార్కెట్ల సౌలభ్యానికి భరోసా ఇస్తుందని ప్రకటించారు.

ఈ మేరకు పార్లమెంటు సభ్యులు శ్రీ అశోక్‌ నేతే పోస్ట్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధాని పంపిన ట్వీట్‌లో:

  “శ్రమజీవులైన మీ మత్స్యకార సమాజాన్ని బలోపేతం చేయడానికి మేం సదా కృషిచేస్తాం. అంతేకాకుండా మీకు మెరుగైన మార్కెట్ సౌలభ్యంతోపాటు జీవనోపాధికి భరోసా ఇస్తాం” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS



(Release ID: 1905918) Visitor Counter : 126