ప్రధాన మంత్రి కార్యాలయం
నూతన ఆవిష్కరణ మరియు కొత్త మార్పుల ను అనుసరిస్తున్నందుకు గాను వైద్యుల కుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 FEB 2023 9:17AM by PIB Hyderabad
నూతన ఆవిష్కరణ లో సదా అగ్రగామిగా ఉంటున్నందుకు మరియు వైద్య చికిత్స జగతి లో కొత్త మార్పుల ను అనుసరిస్తున్నందుకు వైద్యుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. నడవడం లో ఇబ్బందుల ను ఎదుర్కొంటున్న ఒక రోగి కి చెందిన మోకాలు కీళ్ళు నాలుగింటి మార్పిడి సంబంధి శస్త్ర చికిత్స ను ఎఐఐఎమ్ఎస్ భువనేశ్వర్ విజయవంతం గా నిర్వహించింది. ఇది ఒడిశా లో ఈ తరహా ఒకటో శస్త్ర చికిత్స యే కాకుండా, ప్రపంచ స్థాయి లో చూసినప్పుడు ఇటువంటి రెండో కేసు గా కూడాను ఉంది.
ఎఐఐఎమ్ఎస్ భువనేశ్వర్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘నూతన ఆవిష్కరణ లో ఎప్పుడూ అందరికంటే ముందు ఉంటున్నందుకు మరియు వైద్య చికిత్స జగతి లో కొత్త కొత్త మార్పుల ను అవలంబిస్తున్నందుకు మన వైద్యుల కు ఇవే అభినందన లు. వారి ప్రావీణ్యం మనలను గర్వపడేటట్టు చేస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1898794)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam