ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2023 10:12AM by PIB Hyderabad

   పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జాతీయ పురోగమనం, పేదలకు సేవ దిశగా ఆయన కృషి చిరస్మరణీయం. ఆయన దార్శనికత స్ఫూర్తితో అణగారిన, వెనుకబడిన వర్గాలవారికీ ప్రగతి ఫలాలు అందే విధంగా మేం అహర్నిశలూ శ్రమిస్తున్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1898457) సందర్శకుల సూచీ సంఖ్య : : 199