ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ గాయని వాణీ జయరామ్‌ మృతిపై ప్రధాని సంతాపం

Posted On: 04 FEB 2023 8:37PM by PIB Hyderabad

   ప్రముఖ గాయని వాణీ జయరామ్ మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ప్రతిభావంతురాలైన గాయని వాణీ జయరామ్‌ తన మధుర స్వరంతో వేర్వేరు భాషలలో విభిన్న భావోద్వేగాలను ప్రతిబింబించే గొప్ప పాటలెన్నో పాడిన నేపథ్యంలో- ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆమె కన్నుమూత సృజనాత్మక ప్రపంచానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.



(Release ID: 1896508) Visitor Counter : 162