ప్రధాన మంత్రి కార్యాలయం

డిజిటల్ చెల్లింపులు చాలామంది జీవితాల్లో సౌలభ్య.. సౌకర్యాలు తెచ్చాయి:ప్రధాని

Posted On: 21 JAN 2023 7:15PM by PIB Hyderabad

    డిజిట‌ల్ చెల్లింపులు నేడు అనేకమంది జీవితాల్లో సౌల‌భ్యం.. సౌకర్యం కల్పించాయని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఒక పౌరుడి ట్వీట్‌పై పంపిన స్పందన సందేశంలో:

“డిజిటల్ చెల్లింపులు చాలామంది జీవితాల్లో సౌలభ్యం, సౌకర్యం తెచ్చాయి. మీరు దీనిగురించి చాలా ఉదంతాలను వినే ఉంటారు” అని పేర్కొన్నారు.

   అలాగే భారత్‌లో డిజిటల్ చెల్లింపుల పద్ధతి అనుసరణపై ప్రవాస భారతీయుడి ట్వీట్‌కు బదులిస్తూ- “ఇదిప్పుడు దేశమంతటా సర్వ సాధారణ దృశ్యం. సాంకేతికత, ఆవిష్కరణలకు తగినట్లు మన ప్రజానీకం అద్భుత నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్నారు” అని ప్రధాని అందులో పేర్కొన్నారు.



(Release ID: 1892800) Visitor Counter : 156