ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లో ఒక జన సభ ఏర్పాటైన సందర్భం లో జరిగినదుర్ఘటన ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆయన ప్రకటించారు
Posted On:
29 DEC 2022 10:00AM by PIB Hyderabad
ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా లో ఏర్పాటైన ఒక జన సభ సందర్భం లో జరిగిన దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున, మరి అలాగే ఈ దుర్ఘటన లో గాయాల బారిన పడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి అందించడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు లో ఏర్పాటైన ఒక జన సభ లో దుర్ఘటన జరిగినందుకు బాధపడ్డాను. ఈ దుర్ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే పున: స్వస్థులు అగుదురు గాక. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
*****
DS/ST
(Release ID: 1887209)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam