ప్రధాన మంత్రి కార్యాలయం
సిక్కిం రోడ్డు ప్రమాదంలో సైనిక సిబ్బంది మృతిపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
23 DEC 2022 5:18PM by PIB Hyderabad
సిక్కింలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో సైనిక సిబ్బంది కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో;
“సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి@narendramodi” అని పేర్కొంది.
*****
DS/ST
(Release ID: 1886723)
Read this release in:
Marathi
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam