ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిం రోడ్డు ప్రమాదంలో సైనిక సిబ్బంది మృతిపై ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 23 DEC 2022 5:18PM by PIB Hyderabad

   సిక్కింలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో సైనిక సిబ్బంది కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో;

 

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి@narendramodi” అని పేర్కొంది.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1886723) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Kannada , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam