ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో భ‌గ‌వాన్ శ్రీ రాంలాలా విర‌జ‌మాన్ దర్శనం-పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన ప్ర‌ధానమంత్రి


శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పనుల పరిశీలన

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2022 7:38PM by PIB Hyderabad

   దీపావళి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించారు. అక్కడ భగవాన్ శ్రీ రాంలాలా విరాజమానుని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని ప్రధాని పరిశీలించారు. ఆలయ నిర్మాణ స్థలంలో కార్మికులు సహా ఈ పవిత్ర ప్రాజెక్టుకు సంబంధించిన వ్యక్తులందరితోనూ ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.

 

 


***

 

DS/TS


(రిలీజ్ ఐడి: 1870654) సందర్శకుల సూచీ సంఖ్య : : 213