ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2022 9:53AM by PIB Hyderabad

   భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసిన నాయకుడుగా డాక్టర్ కలాం సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మన మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాంగారికి నివాళి అర్పిస్తున్నాను. దేశానికి శాస్త్రవేత్తగా, సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసిన రాష్ట్రపతిగా ఆయన కృషి ఎంతో ప్రశంసనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

 

DS/TS


(రిలీజ్ ఐడి: 1868001) సందర్శకుల సూచీ సంఖ్య : : 307