ప్రధాన మంత్రి కార్యాలయం
ఇయాన్ పెనుతుఫానుతో ప్రాణనష్టంపై అధ్యక్షుడు జో బైడెన్కు ప్రధానమంత్రి సంతాపం
Posted On:
02 OCT 2022 9:40AM by PIB Hyderabad
ఇయాన్ పెనుతుపాను వల్ల అమెరికాలో ప్రాణ-ఆస్తి నష్టం సంభవించడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక సంతాపం, సానుభూతి తెలియజేశారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇయాన్ పెనుతుపాను ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోవడంతోపాటు విధ్వంసం సంభవించడంపై @POTUS @JoeBidenకు నా హృదయపూర్వక సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో మేమంతా అమెరికా ప్రజల మనోభావాలతో మమేకం అవుతున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1864396)
Visitor Counter : 114
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam