ప్రధాన మంత్రి కార్యాలయం

ఇయాన్ పెనుతుఫానుతో ప్రాణనష్టంపై అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 02 OCT 2022 9:40AM by PIB Hyderabad

   యాన్ పెనుతుపాను వల్ల అమెరికాలో ప్రాణ-ఆస్తి నష్టం సంభవించడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక సంతాపం, సానుభూతి తెలియజేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ఇయాన్ పెనుతుపాను ఫలితంగా విలువైన ప్రాణాలు కోల్పోవడంతోపాటు విధ్వంసం సంభవించడంపై @POTUS @JoeBidenకు నా హృదయపూర్వక సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో మేమంతా అమెరికా ప్రజల మనోభావాలతో మమేకం అవుతున్నాం” అని ప్రధాని పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1864396) Visitor Counter : 114