ప్రధాన మంత్రి కార్యాలయం

ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఫ్రాటెల్లి-డి'ఇటాలియా కు నాయకత్వం వహించినందుకు జార్జియా మెలోని ని అభినందించిన - ప్రధానమంత్రి

Posted On: 28 SEP 2022 8:51AM by PIB Hyderabad

ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఫ్రాటెల్లి-డి'ఇటాలియా కు నాయకత్వం వహించినందుకు జార్జియా మెలోని ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, 

"ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ ఫ్రాటెల్లి-డి'ఇటాలియా ను విజయపథంలో నడిపించినందుకు జార్జియా మెలోని కి అభినందనలు.   మన సంబంధాలను బలోపేతం చేసుకునే విధంగా కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము." అని పేర్కొన్నారు.  

 

***

DS/ST

 

 



(Release ID: 1862852) Visitor Counter : 239