సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రముఖ నటిఆశా పరేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2020తో సత్కరించనున్నారు


68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 30న జరగనుంది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహించనున్నారు

Posted On: 27 SEP 2022 1:35PM by PIB Hyderabad

2020 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ నటి  ఆశా పరేఖ్‌కు ప్రదానం చేయనున్నట్లు సమాచార  ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో జరిగే జాతీయ చలనచిత్ర అవార్డు వేడుకలో ఈ అవార్డును అందజేయనున్నారు. కేంద్ర మంత్రి  అనురాగ్ ఠాకూర్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "సమాచార  ప్రసార మంత్రిత్వ శాఖ ప్రముఖ నటికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించడం గర్వించదగ్గ విషయం" అని అన్నారు. 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం 2022 సెప్టెంబర్ 30న నిర్వహించబడుతుందని, దీనికి భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారని మంత్రి ప్రకటించారు.  ఆశా పరేఖ్ ప్రఖ్యాత సినీ నటి, దర్శకురాలు  నిర్మాత  నిష్ణాతులైన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె దిల్ దేకే దేఖోలో కథానాయికగా అరంగేట్రం చేసింది  95 చిత్రాలలో నటించింది. ఆమె కటి పతంగ్, తీస్రీ మంజిల్, లవ్ ఇన్ టోక్యో, అయా సావన్ ఝూమ్ కే, ఆన్ మీలో సజ్నా, మేరా గావ్ మేరా దేశ్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఆశాకు 1992లో పద్మ అవార్డు దక్కింది. ఆమె 1998–-2001 మధ్య ఫిల్మ్ సర్టిఫికేషన్ కోసం సెంట్రల్ బోర్డ్ అధిపతిగా కూడా పనిచేశారు.

 

 పరేఖ్‌కు అవార్డును ప్రదానం చేయాలని ఐదుగురు సభ్యుల జ్యూరీ నిర్ణయం తీసుకున్నట్లు  అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 52వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కోసం జ్యూరీలో చలనచిత్ర పరిశ్రమ నుండి ఐదుగురు సభ్యులు ఉన్నారు:

 

 హేమ మాలిని

 పూనమ్ ధిల్లాన్

 టీఎస్ నాగాభరణ

 ఉదిత్ నారాయణ్

 ఆశా భోంస్లే

***



(Release ID: 1862511) Visitor Counter : 201