ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్‌రావు గవిట్‌ మృతికి ప్రధాని సంతాపం

Posted On: 17 SEP 2022 7:45PM by PIB Hyderabad

   కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్‌ రావు గవిట్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం, విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్‌రావు గవిట్‌ మరణం బాధాకరం. అత్యంత అనుభవజ్ఞుడైన పార్లమెంటు సభ్యులలో ఆయనొకరు. గిరిజన వర్గాల సాధికారత కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు... ఓం శాంతి: PM @narendramodi”



(Release ID: 1860328) Visitor Counter : 116