కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

హ‌ర్ ఘ‌ర్ తిరంగా

Posted On: 10 AUG 2022 2:07PM by PIB Hyderabad

 రూ. 25/- కు జాతీయ జెండాల‌ను విక్ర‌యిస్తున్న పోస్టాఫీసులు; ఎటువంటి డెలివ‌రీ చార్జీలు తీసుకోకుండానే జెండాల అంద‌చేత‌
జాతీయ జెండాల‌ను పౌరులు ఇపోస్ట్ ఆఫీస్ పోర్ట‌ల్ ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు

జెండాల‌ను స‌కాలంలో అంద‌చేసేందుకై 12 ఆగ‌స్టు 2022 అర్థ‌రాత్రి లోప‌లే పౌరులు త‌మ ఆర్డ‌ర్ల‌ను చేయ‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి చేసిన పోస్ట‌ల్ విభాగం. 

న్యూఢిల్లీ, ఆగ‌స్టు 10 (పిఐబి)ః దేశాభిమానం క‌లిగిన పౌరుల‌కు జాతీయ జెండాలు తేలిక‌గా అందుబాటులో ఉండేలా చూసేందుకు, దేశ‌వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు రూ. 25/- చొప్పున జాతీయ జెండాలు అమ్ముతున్నాయి. పెద్ద సంఖ్య‌లో పౌరులు ఇపోస్ట్ ఆఫీస్ పోర్ట‌ల్ (https://www.epostoffice.gov.in/ProductDetails/Guest_productDetailsProdid=ca6wTEVyMuWlqlgDBTtyTw== ) ద్వారా జెండాల‌ను ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తున్నారు. 
దేశంలో ఏ ప్రాంతంలోని చిరునామాకు అయినా పోస్ట‌ల్ శాఖ అటువంటి జెండాల‌ను ఎటువంటి డెలివ‌రీ చార్జీలు లేకుండానే అద‌చేస్తోంది. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసిన జాతీయ జెండాల‌ను స‌కాలంలో అంద‌చేసేందుకు, త‌మ ఆర్డ‌ర్ల‌ను 12 ఆగ‌స్టు 2022 అర్థ‌రాత్రి లోప‌ల ఉంచ‌వ‌ల‌సిందిగా పౌరులకు పోస్ట‌ల్ విభాగం విజ్ఞ‌ప్తి చేసింది. 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F5H7.jpg

***



(Release ID: 1850545) Visitor Counter : 524