ప్రధాన మంత్రి కార్యాలయం
టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్విభాగం లో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 AUG 2022 7:52PM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ విభాగం లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ @sharathkamal1 సాధించిన స్వర్ణ పతకం చరిత్ర లో ఓ చాలా విశేషమైనటువంటి పతకం గా నమోదు అవుతుంది. ఆయన అంతులేని ఓర్పు, దృఢసంకల్పం మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలచే స్వభావాల తాలూకు శక్తి ని పరిచయం చేశారు. ఆయన గొప్ప నైపుణ్యాలను కూడా చాటారు. ఈ పతకం భారతదేశం లో టేబుల్ టెనిస్ క్రీడ కు ఎక్కడలేనటువంటి ఉత్సాహవర్ధకం గా నిలుస్తుంది. ఆయన కు ఇవే అభినందనలూ, శుభాకాంక్షలూ ను. #Cheer4India.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1850303)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam