ప్రధాన మంత్రి కార్యాలయం

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో ల  విభాగం లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీఅమిత్ పంఘాల్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 07 AUG 2022 5:43PM by PIB Hyderabad

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పురుషుల బాక్సింగ్ క్రీడ 51 కిలో విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ అమిత్ పంఘాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘తెలివితేటలు గల శ్రీ అమిత్ పంఘాల్ చలవ తో మన పతకాల పట్టిక లో మరొక ప్రతిష్టాత్మకమైన పతకమొకటి వచ్చి చేరింది. ఆయన మనం ఎంతగానో అభిమానించేటటువంటి నైపుణ్యం కలిగిన బాక్సర్ లలో ఒకరు. ఆయన గొప్పదైన కౌశలాన్ని చాటారు. స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు గాను ఆయన ను నేను అభినందిస్తున్నాను, మరి భవిష్యత్తు లో ఆయన ఎంతో చక్క గా రాణించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. #Cheer4India” అని పేర్కొన్నారు.

 



(Release ID: 1849564) Visitor Counter : 111