ప్రధాన మంత్రి కార్యాలయం

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో వరుసగా మూడోసారి పతకం సాధించిన కుస్తీ వీరుడు బజరంగ్ పునియాకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 05 AUG 2022 11:05PM by PIB Hyderabad

   కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల కుస్తీ 62 కిలోల విభాగంలో బజరంగ్‌ పునియా స్వర్ణ పతకం కైవసం చేసుకుని, వరుసగా మూడోసారి కామన్వెల్త్‌ పతక విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన సందేశంలో;

   “ప్రతిభావంతుడైన బజరంగ్‌ పునియా నిలకడకు, నైపుణ్యానికి ప్రతీక. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆయన స్వర్ణ పతకం సాధించారు. ఈ అద్భుత విజయం సొంతం చేసుకోవడంతోపాటు వరుసగా మూడోసారి కామన్వెల్త్‌ క్రీడా పతకం కైవసం చేసుకోవడంపై నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం సదా ఉత్తేజపూరితం... నా శుభాకాంక్షలు సదా ఆయనవెంటే ఉంటాయి” అని పేర్కొన్నారు.



***
 


DS/TS



(Release ID: 1849092) Visitor Counter : 107