ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా మూడోసారి పతకం సాధించిన కుస్తీ వీరుడు బజరంగ్ పునియాకు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
05 AUG 2022 11:05PM by PIB Hyderabad
కామన్వెల్త్ గేమ్స్-2022 పురుషుల కుస్తీ 62 కిలోల విభాగంలో బజరంగ్ పునియా స్వర్ణ పతకం కైవసం చేసుకుని, వరుసగా మూడోసారి కామన్వెల్త్ పతక విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“ప్రతిభావంతుడైన బజరంగ్ పునియా నిలకడకు, నైపుణ్యానికి ప్రతీక. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఆయన స్వర్ణ పతకం సాధించారు. ఈ అద్భుత విజయం సొంతం చేసుకోవడంతోపాటు వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడా పతకం కైవసం చేసుకోవడంపై నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం సదా ఉత్తేజపూరితం... నా శుభాకాంక్షలు సదా ఆయనవెంటే ఉంటాయి” అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1849092)
Visitor Counter : 107
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam