ప్రధాన మంత్రి కార్యాలయం

క్వాడ్ నేత‌ల శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రితో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 24 MAY 2022 2:24PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , జ‌పాన్ లోని టోక్యోలీ 2022 మే 24న క్వాడ్ నేత‌ల స‌మావేశం సంద‌ర్భంగా  ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ ఆంథోనీ అల్బెనీస్ తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు.
ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించినందుకు అల్బ‌నీస్ ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. స‌మ‌గ్ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం కింద బ‌హుముఖ స‌హ‌కారానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ఇరువురు నాయ‌కులు స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా వారు వాణిజ్యం,  పెట్టుబ‌డులు, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తులు, పున‌రుత్పాద‌క ఇంధ‌నం, హ‌రిత హైడ్రోజ‌న్‌, విద్య , శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌, ప్ర‌జ‌ల‌కు - ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు త‌దిత‌ర అంశాల‌ను స‌మీక్షించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల‌లో సాను కూల వేగాన్ని కొన‌సాగించాల‌న్న త‌మ బ‌ల‌మైన ఆకాంక్ష‌ను ఇరువురు ప్ర‌ధాన‌మంత్రులు వ్య‌క్తం చేశారు.
వీలైనంత త్వ‌ర‌గా భార‌త్‌లో ప‌ర్య‌టించాల్సిందిగా ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రిని , శ్రీ న‌రేంద్ర మోదీ కోరారు.

 

***



(Release ID: 1828105) Visitor Counter : 118