ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిహార్ లోని అనేక జిల్లాల లో తుఫానుమరియు పిడుగు పాటు ఘటన ల కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2022 11:12PM by PIB Hyderabad

బిహార్ లోని అనేక జిల్లాల లో గాలివాన మరియు పిడుగు పాటు ఘటన ల కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్థానిక పాలన యంత్రాంగం పూర్తి తత్పరత తో సహాయ కార్యక్రమాల ను చేపడుతోంది అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘బిహార్ లోని అనేక జిల్లాల లో గాలివాన మరియు పిడుగు లు పడ్డ ఘటనల లో చాలా మంది మృత్యువు బారిన పడడం తో అత్యంత దు:ఖం కలిగింది. ఈ అపారమైన దు:ఖాన్ని భరించేటటువంటి శక్తి ని శోక సంతప్త కుటుం బాల కు ఆ ఈశ్వరుడు ప్రసాదించు గాక. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం రక్షణ మరియు సహాయక కార్యకలాపాల లో తలమునకలు గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1827272) సందర్శకుల సూచీ సంఖ్య : : 166