ప్రధాన మంత్రి కార్యాలయం

జ‌ర్మ‌నీ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 02 MAY 2022 7:23PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ  జ‌ర్మ‌న్ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ హిజ్ ఎక్స‌లెన్సీ ఓలాఫ్ షోల్జ్‌ తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఇండియా జ‌ర్మ‌నీల మ‌ధ్య  ఆరోవిడ‌త‌, ద్వైవార్షిక అంత‌ర్ ప్ర‌భుత్వ సంప్ర‌దింపుల‌కు (ఐజిసి) ముంద‌స్తుగా ఈ సమావేశం జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి కి గౌర‌వ వంద‌నం స‌మ‌ర్పించారు. జ‌ర్మ‌న్ ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఛాన్స‌ల‌ర్ షోల్జ్ ప్ర‌ధాన‌మంత్రికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ద్వైపాక్షిక స‌హ‌కారం, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి సంబంధించిన ప‌లు అంశాలు ,ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ  ప‌రిణామాలు ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.



(Release ID: 1822446) Visitor Counter : 131