ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళ నాడు లోని తంజావూరు లో దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు 

Posted On: 27 APR 2022 9:51AM by PIB Hyderabad

తమిళ నాడు లోని తంజావూర్ లో దుర్ఘటన సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన లో బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) అనేక ట్వీట్ లలో -

‘‘తమిళ నాడు లోని తంజావూర్ లో దుర్ఘటన సంభవించినందుకు చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరలోనే కోలుకొంటారని నేను ఆశపడుతున్నాను: ప్రధాన మంత్రి’’

‘‘తమిళ నాడు లోని తంజావూర్ లో సంభవించిన దుర్ఘటన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి తలా 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన లో గాయపడ్డ వారి కి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి ’’ అని పేర్కొంది.

 

 

***

DS/SH

 



(Release ID: 1820790) Visitor Counter : 124