ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షలపై చర్చ... పరీక్షలతోపాటు జీవితంలోని అనేక సమస్యలపై చర్చకు ఒక శక్తిమంతమైన వేదిక: ప్రధానమంత్రి
Posted On:
16 APR 2022 6:43PM by PIB Hyderabad
“నమో" యాప్లోని వినూత్న నవీకృత విభాగంలో పరీక్షలపై చర్చకు సంబంధించిన పరస్పర సంభాషణల సమగ్ర రూపం నుంచి కొత్త ఆలోచనలను గ్రహించవచ్చునని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"నేను మన చైతన్యవంతులైన పరీక్షల యోధులతో సంభాషించడంపై ఎంతో సంతోషిస్తున్నాను. పరీక్షలపై చర్చ అనేది పరీక్షల గురించి మాత్రమేగాక జీవితానికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చకు ఒక శక్తిమంతమైన వేదిక. ఈ పరస్పర సంభాషణల నుంచి సరికొత్త ఆలోచనలను నమో యాప్లోని వినూత్న నవీకృత విభాగంలో చూడవచ్చు" అని పేర్కొన్నారు.
****
DS/ST