ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న అమరులైన వారికి శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి 

Posted On: 13 APR 2022 10:22AM by PIB Hyderabad

జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం లో ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన అనంతరం కిందటి సంవత్సరం లో ఆ స్మారకాన్ని ప్రారంభించిన కార్యక్రమం లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జాలియాంవాలా బాగ్ లో 1919వ సంవత్సరం ఇదే రోజు న ప్రాణ సమర్పణం చేసిన వారి కి వందనాలు. వారి అసాధారణమైనటువంటి సాహసం మరియు బలిదానం రాబోయే తరాల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. గడచిన సంవత్సరం లో జాలియాంవాలా బాగ్ స్మారక భవన సముదాయాన్ని పునర్ నవీకరించిన తరువాత ఆ స్మారకాన్ని ప్రారంభించిన సమయం లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని శేర్ చేస్తున్నాను https://t.co/zjqdqoD0q2 ’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(Release ID: 1816350) Visitor Counter : 205