ప్రధాన మంత్రి కార్యాలయం
నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను స్మరించుకొన్నప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 APR 2022 10:07AM by PIB Hyderabad
నేశనల్ మేరిటైమ్ డే నాడు భారతదేశం యొక్క సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. భారతదేశం ఆర్థిక వృద్ధి లో సముద్ర రంగాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, గడచిన 8 సంవత్సరాల లో భారత ప్రభుత్వం ఓడరేవుల ను కేంద్ర స్థానం లో ఉంచి అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడమైందని, ఆర్థిక వృద్ధి కి మరియు ఆత్మనిర్భర్ భారత్ యొక్క నిర్మాణాని కి ఇది ఎంతో అవసరం అన్నారు. భారత ప్రభుత్వం సముద్ర సంబంధి ఇకో-సిస్టమ్ కు మరియు వివిధత్వాని కి పూచీ పడడం కోసం సముచితమైన జాగ్రత చర్యల ను తీసుకొంటున్నది అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘ఈ రోజు న, నేశనల్ మేరిటైమ్ డే నాడు మనం మన సముద్ర సంబంధి గౌరవనీయ చరిత్ర ను స్మరించుకొంటున్నాం. మరి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి లో సముద్ర రంగాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా ప్రస్తావించుకొంటున్నాం. గడచిన 8 సంవత్సరాల లో మన సముద్ర రంగం కొత్త శిఖరాల ను అందుకొంది; అంతే కాకుండా వ్యాపార కార్యకలాపాల ను మరియు వాణిజ్య కార్యకలాపాల ను ప్రోత్సహించడం లో కూడా సముద్ర రంగం తోడ్పడింది.’’
‘‘గత ఎనిమిదేళ్ళ లో భారత ప్రభుత్వం ఓడ రేవులను కేంద్ర స్థానం లో ఉంచి అభివృద్ధి సాధన పట్ల శ్రద్ధ వహిస్తున్నది. దీనిలో నౌకాశ్రయాల సామర్ధ్యాన్ని పెంపొందింపచేయడం తో పాటు ఇప్పటికే ఉన్న ప్రణాళికల ను ఇంకా సమర్ధమైనవి గా తీర్చిదిద్దడం భాగాలు గా ఉన్నాయి. కొత్త బజారుల కు భారతీయ ఉత్పత్తులు చేరడానికి పూచీ పడడం కోసం జల మార్గాల ను వినియోగించడం జరుగుతోంది.’’
‘‘ఒక పక్క మనం ఆర్థిక ప్రగతి కోసం మరియు ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించుకోవడం కోసం మేరిటైమ్ సెక్టర్ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకొంటూనే, దీనితో పాటు భారతదేశం యొక్క గౌరవశాలి మరీన్ ఇకో-సిస్టమ్, వివిధత్వం లు సురక్షితం గా ఉండేలా పూచీ పడడం కోసం సముచితమైనటువంటి జాగ్రత చర్యల ను కూడా తీసుకొంటున్నాం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1813565)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam