ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యార్థులు, వారి తల్లితండ్రులుమరియు గురువుల తో 2022 ఏప్రిల్ 1 నాడు ‘పరీక్షా పే చర్చా’’ కార్యక్రమం లోపాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
Posted On:
26 MAR 2022 11:56AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 1 నాడు దిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో ఏర్పాటు కానున్న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం లో విద్యార్థులు, వారి తల్లితండ్రులు మరియు గురువుల తో సమావేశం కానున్నారు. ఒత్తిడి బారి న పడకుండా పరీక్షలు రాయడాన్ని గురించి ఆయన మాట్లాడుతారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఒత్తిడి కి తావు ఉండనటువంటి పరీక్షల ను గురించి మనం మరొక్కసారి మాట్లాడుకొందాం. శక్తివంతులు అయినటువంటి #ExamWarriors , వారి తల్లితండ్రుల ను మరియు గురువుల ను ఏప్రిల్ 1వ తేదీ నాడు జరిగే ఈ సంవత్సరం తాలూకు పరీక్షా పే చర్చా కార్యక్రమం లో పాలుపంచుకోండంటూ పిలుపునిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST