ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్మాన్భారత్ పిఎమ్ జెఎవై మూడు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం పట్ల ప్రశంస ను వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
Posted On:
23 SEP 2021 4:15PM by PIB Hyderabad
ప్రపంచం లో అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అయినటువంటి ‘ఆయుష్మాన్ భారత్ పిఎమ్ జెఎవై’ మూడు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.
మైగవ్ఇండియా (MyGovIndia) కు ప్రధాన మంత్రి ఇచ్చిన ఒక సమాధానం లో-
‘‘ఆరోగ్య సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని గడచిన సంవత్సరం లో మరింత స్పష్టం గా అర్థం చేసుకోవడం జరిగింది.
మన పౌరుల కు అగ్రగామి నాణ్యత కలిగిన మరియు తక్కువ ఖర్చు తో కూడిన ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడాలి అన్నదే మా వాగ్దానం గా ఉంది. ఈ దార్శనికత ను సాకారం చేయడం లో ఆయుష్మాన్ భారత్ పిఎమ్ జెఎవై పాత్ర కీలకం. #3YearsofPMJAY’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 1757300)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam