ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంజినీర్స్ డే సందర్భం లో ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 15 SEP 2021 10:44AM by PIB Hyderabad

కఠోర శ్రమ చేసే ఇంజినీర్ లు అందరికి ఇంజినీర్స్ డే నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అలాగే, శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ఘటించి, శ్రీ విశ్వేశ్వరయ్య గారి కార్యసిద్ధుల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘కష్టించి పని చేసే ఇంజినీర్ లు అందరికి ఇవే శుభాకాంక్ష లు. మన ప్రపంచాన్ని ఉత్తమమైంది గాను, సాంకేతికత పరం గా ఆధునికమైంది గాను తీర్చిదిద్దడం లో కీలకమైన పాత్ర ను పోషిస్తున్నటువంటి ఇంజినీర్ లకు ధన్యవాదాలు తెలియజేయడానికి ఎన్ని పదాల ను ఉపయోగించినప్పటికీ అవి చాలవు. అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య గారు సాధించిన కార్యాల ను నేను గుర్తు కు తెచ్చుకొంటూ ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

Greetings on #EngineersDay to all hardworking engineers. No words are enough to thank them for their pivotal role in making our planet better and technologically advanced. I pay homage to the remarkable Shri M. Visvesvaraya on his birth anniversary and recall his accomplishments.

— Narendra Modi (@narendramodi) September 15, 2021

 

***

DS/SH



(Release ID: 1755004) Visitor Counter : 185