ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి


బాధితులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన - శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2021 11:15PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

"బుల్ధానా జిల్లాలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరిగినందుకు విచారించాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతి చెందిన వారి సమీప బంధువులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది : ప్రధానమంత్రి మోదీ" అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు, ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేసింది.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1748181) సందర్శకుల సూచీ సంఖ్య : : 144