ప్రధాన మంత్రి కార్యాలయం

ఆయుర్వేద ప్రతిపాదకుడు డాక్టర్ శ్రీ బాలాజీ తాంబే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 11 AUG 2021 10:21AM by PIB Hyderabad

ఆయుర్వేద చికిత్సకుడు, యోగ సమర్ధకుడు డాక్టర్ శ్రీ బాలాజీ తాంబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘ఆయుర్వేద కు ప్రపంచం అంతటా, ప్రత్యేకించి యువత లో, లోకప్రియత్వాన్ని సంపాదించిపెట్టడం కోసం డాక్టర్ శ్రీ బాలాజీ తాంబే చేసిన అసంఖ్యాక ప్రయాసలకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన తన దయాభరితమైన స్వభావరీత్యా కూడాను అభిమానపాత్రుడు అయ్యారు. ఆయన మరణం దు:ఖాన్ని కలిగించింది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే సంతాపం. ఓం శాంతి.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/ VJ



(Release ID: 1744708) Visitor Counter : 187