ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ టీకా కార్యక్రమంలో మరో మైలురాయిని అధిగమించిన భారత్‌, అమెరికాలో వేసిన టీకాల సంఖ్యను మించి మనదేశంలో టీకాలు


దేశవ్యాప్తంగా 32.36 కోట్ల టీకాలు అందజేత

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసులు 46,148

5,72,994కు తగ్గిన యాక్టివ్‌ కేసుల సంఖ్య

Posted On: 28 JUN 2021 11:09AM by PIB Hyderabad

కొవిడ్‌ టీకాల విషయంలో భారత్‌ మరో ఘనత  సాధించింది. ప్రజలకు అందించిన టీకాల విషయంలో అమెరికాను అధిగమించింది. భారత్‌లో టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16వ తేదీన ప్రారంభంకాగా, అమెరికాలో 2020 డిసెంబర్ 14న మొదలైంది.
                         
 
    దేశవ్యాప్తంగా అందించిన టీకా డోసుల సంఖ్య ఆదివారంతో 32.36 కోట్లను దాటింది. ఈ ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 43,21,898  సెషన్ల ద్వారా మొత్తం 32,36,63,297  డోసులు అందించారు. గత 24 గంటల్లో 17,21,268  డోసులు అందించారు.
 
పూర్తి వివరాలు:
 
హెచ్‌సీడబ్ల్యూలు            మొదటి డోసు    1,01,98,257
                                       రెండో డోసు    72,07,617
ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు            మొదటి డోసు    1,74,42,767
                                        రెండో డోసు    93,99,319
18-44 వయసు వారికి       మొదటి డోసు    8,46,51,696
                                        రెండో డోసు    19,01,190
45-59 వయసు వారికి       మొదటి డోసు    8,71,11,445
                                        రెండో డోసు    1,48,12,349
60 ఏళ్లు పైబడినవారికి     మొదటి డోసు    6,75,29,713
                                        రెండో డోసు    2,34,08,944
మొత్తం                             32,36,63,297
 
భారత్‌లో కొవిడ్‌ టీకా సార్వత్రీకరణ కార్యక్రమం ఈ ఏడాది జూన్ 21 నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, పరిధి విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,148 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 21 వరుస రోజుల్లో, లక్ష కన్నా తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అవిశ్రాంత, సహకార ప్రయత్నాల ఫలితంగా ఇది సాధ్యమైంది.

 

                                        
దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ప్రతిరోజూ పడిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్త యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,72,994గా ఉంది.

గత 24 గంటల్లో, యాక్టివ్‌ కేసులు మరో 13,409 తగ్గాయి. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ప్రస్తుతమున్న క్రియాశీల కేసులు 1.89 శాతం మాత్రమే.

 

                             
కొవిడ్‌ బారి నుంచి కోలుకుంటున్న ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున, దేశవ్యాప్తంగా రికవరీలు వరుసగా 46వ రోజు కూడా రోజువారీ కేసులను మించాయి. గత 24 గంటల్లో 58,578 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

రోజువారీ నమోదయ్యే కొత్త కేసులతో పోలిస్తే, గత 24 గంటల్లో దాదాపు 12 వేలకుపైగా (12,430) రికవరీలు నమోదయ్యాయి.

 

                          
కరోనా విజృంభించిన ప్రారంభ రోజుల నుంచి, వైరస్‌ సోకిన వారిలో 2,93,09,607 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,578 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు 96.80 శాతంగా నమోదైంది. ఈ రికవరీ రేటు నిరంతరం పెరుగుతూనే ఉంది.

 

                          

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడంతో, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 15,70,515 పరీక్షలు చేశారు. మొత్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.63 కోట్లకుపైగా (40,63,71,279) పరీక్షలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యంలో వృద్ధి కనిపిస్తుండగా, వారపు పాజిటివిటీ ప్రతిరోజూ క్షీణిస్తూనే ఉంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం 2.81గా ఉండగా, రోజువారీ పాజిటివిటీ ఇవాళ 2.94 శాతంగా ఉంది. వరుసగా 21వ రోజు కూడా 5 శాతం కన్నా తక్కువగా నమోదైంది.

                            



(Release ID: 1730869) Visitor Counter : 259