ప్రధాన మంత్రి కార్యాలయం

‘బసవ జయంతి’ నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరునికి ప్రధాని ప్రణామం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2021 9:57AM by PIB Hyderabad

   ‘బసవ జయంతి’ సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణమిల్లారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘బసవ జయంతి ప్రత్యేక సందర్భం నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరునికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన పవిత్ర బోధనల్లో... ముఖ్యంగా సామాజిక సాధికారత, సామరస్యం, సౌభ్రాత్రం, కరుణ వంటి ఆదర్శాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయన ప్రబోధాలు నేటికీ అనేకమందికి స్ఫూర్తినిస్తున్నాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1718528) సందర్శకుల సూచీ సంఖ్య : : 265