ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అక్సిజెన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, ఉత్పత్తి ప్లాంట్లు, 3.4 లక్షల రెమిడిసివర్ ఇంజెక్షన్లు సహా విదేశీ సాయం రాష్ట్రాలకు పంపిణీ


61 రోజుల తరువాత మొదటి సారిగా గత 24 గంటలలో కొత్తకేసులకంటే ఎక్కువగా కోలుకుంటున్నవారి సంఖ్య
2 నెలల తరువాత చికిత్సలో ఉన్న కేసులు 30,016 తగ్గుదల
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 25.5 లక్షలమందికి టీకాలు

Posted On: 11 MAY 2021 11:40AM by PIB Hyderabad

భారతదేశం కోవిడ్ మీద జరుగుతున్న పోరుకు సహకరిస్తూ విదేశాలనుంచి అందిన 8,900 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, 5,043 ఆక్సిజెన్ సిలిండర్లు, 18 ఆక్సిజెన్ ఉత్పత్తి కేంద్రాలు, 5,698 వెంటిలేటర్లు, 3.4 లక్షలకు పైగా రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపటం ద్వారా వారి కార్యకలాపాలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. వీలైనంత వేగంగా ప్రపంచ సాయం రాష్ట్రాలకు అందించటానికి కేంద్రప్రభుత్వం  కస్టమ్ అనుమతులు, రవాణా అనుమతులు వేగవంతం చేసింది.

మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలు కావటంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 17.27 కోట్లు దాటింది.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 30,016 నమోదయింది. ఇది గత రెండు నెలలలో మొదటి సారిగా నమోదైన తక్కువ సంఖ్య. అదే విధంగా 61 రోజుల తరువాత కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులను మించిపోయింది.  భారత్ లో రోజువారీ కొత్త కేసులు, కోలుకుంటున్నవారి సంఖ్య ఈ క్రింది పట్టికలో పొందుపరచబడింది.

 

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 25,15,519 శిబిరాల ద్వారా  17,27,10,066 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన  95,64,242 మొదటి డోసులు, 65,05,744 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,40,54,058 మొదటి డోసులు, 78,53,514 రెండో డోసులు, 18-44 వయోవర్గానికిచ్చిన 25,59,339 మొదటీ డోసులు,  45-60 వయోవర్గానికిచ్చిన  5,55,10,630  మొదటీ డోసులు, 71,95,632 రెండో డోసులు,  60 పైబడిన వారికిచ్చిన 5,38,06,205 మొదటి డోసులు, 1,56,60,702 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,64,242

2వ డోస్

65,05,744

కోవిడ్ యోధులు

1వ డోస్

1,40,54,058

2వ డోస్

78,53,514

18-44 వయోవర్గం

1వ డోస్

25,59,339

 45 - 60 వయోవర్గం

1వ డోస్

5,55,10,630

2వ డోస్

71,95,632

60 పైబడ్డవారు

1వ డోస్

5,38,06,205

2వ డోస్

1,56,60,702

 

మొత్తం

17,27,10,066

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 66.7% వాటా  పది రాష్టాలలోనే ఇచ్చారు..

 

18-44 వయోవర్గంలో 5,24,731 మంది గత 24 గంటలలో టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా మొత్తం 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 25,59,339 మందికి ఈ మూడోదశలో టీకాలిచ్చారు.  18-44 వయోవర్గానికి ఇచ్చిన టీకాల సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది.  

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,059

2

ఆంధ్రప్రదేశ్

812

3

అస్సాం

1,06,750

4

బీహార్

1,79,507

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,026

7

ఢిల్లీ

3,66,391

8

గోవా

1,228

9

గుజరాత్

3,24,192

10

హర్యానా

2,94,109

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ-కశ్మీర్

29,139

13

జార్ఖండ్

94

14

కర్నాటక

21,485

15

కేరళ

397

16

లద్దాఖ్

86

17

మధ్యప్రదేశ్

48,910

18

మహారాష్ట్ర

5,10,518

19

మేఘాలయ

2

20

నాగాలాండ్

4

21

ఒడిశా

50,062

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

4,163

24

రాజస్థాన్

4,13,411

25

తమిళనాడు

16,735

26

తెలంగాణ

500

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

1,67,308

29

ఉత్తరప్రదేశ్

14,340

30

పశ్చిమ బెంగాల్

7,092

                               మొత్తం

25,59,339

 

గత 24 గంటలలో 25 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 115 వ రోజున ( మే 10న )

25,03,756 మందికి 18,542 శిబిరాల ద్వారా  10,75,948 మొదటి డోసులు,  14,27,808 రెండో డోసులు ఇచ్చారు.

తేదీ: మే 10, 2021 ( 115 వరోజు)

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

16,754

2వ డోస్

33,931

కోవిడ్ యోధులు

1వ డోస్

79,417

2వ డోస్

96,884

18-44 వయోవర్గం

1వ డోస్

5,24,731

45- 60 వయోవర్గం

1వ డోస్

3,25,342

2వ డోస్

6,26,213

60 పైబడ్డవారు

1వ డోస్

1,29,704

2వ డోస్

6,70,780

మొత్తం

1వ డోస్

10,75,948

2వ డోస్

14,27,808

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,90,27,304 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 82.75%. గత 24 గంటలలో 3,56,082 కోలుకున్నారు. ఇందులో పది రాష్ట్రాల వాటా 72.28% .

 

గత 24 గంటలలో 3,29,942 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 69.88% వాటా పది రాష్ట్రాలదే. కర్నాటకలో అత్యధికంగా 39,305 కొత్త కేసులు కాగా, మహారాష్ట్రలో 37,236, తమిళనాడులో 28,978 కేసులు వచ్చాయి.

దేశంలో చికిత్సలో ఉన్న కేసులు 37,15,221కు తగ్గాయి.  ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 16.16%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు నికరంగా 30,016 తగ్గాయి. గత 61 రోజులలో ఈ విధమైన తగ్గుదల నమోదవటం ఇదే మొదటి సారి. చికిత్సలో ఉన్న కేసులలో 82.68% 13 రాష్ట్రాలలో నమోదైంది.

 

దేశంలోని చికిత్సలో ఉన్న కేసులలో 24.44% కేవలం పది జిల్లాల్లో నమోదయ్యాయి.

 

కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.09%. గత 24 గంటలలో 3,876  మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్టాల వాటా 73.09% ఉంది. కర్నాటకలో అత్యధికంగా 596 మరణాలు సంభవించగా మహారాష్టలో 549 మంది చనిపోయారు.

****



(Release ID: 1717648) Visitor Counter : 211