ప్రధాన మంత్రి కార్యాలయం

యోగా గురు స్వామి అధ్యాత్మానంద జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2021 3:37PM by PIB Hyderabad

యోగా గురు స్వామి అధ్యాత్మానంద జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆయన కు ప్ర‌ధాన మంత్రి ఓ ట్వీట్ లో శ్రద్ధాంజలి ని ఘటించారు.  గూఢమైన ఆధ్యాత్మిక అంశాల ను స్వామీ జీ ఇట్టే అర్థమయ్యేటట్టు వివరించే వారని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  స్వామీ జీ యోగ విద్య తో పాటు అహమదాబాద్ లోని శివానంద ఆశ్రమం నిర్వహించే అనేక విధాలైన నిర్మాణాత్మక కార్యకలాపాల మాధ్యమం ద్వారా సమాజానికి ఏ విధం గా సేవల ను అందించిందీ కూడా ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.    

***

DS/AK


(రిలీజ్ ఐడి: 1717091) సందర్శకుల సూచీ సంఖ్య : : 168