రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశంలో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిలో మూడు రెట్ల పెరుగుదల: శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ


మూడింతలైన రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్య

Posted On: 04 MAY 2021 1:43PM by PIB Hyderabad

"దేశంలో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి శరవేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే, ఈ ఔషధం ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు పెరిగింది. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కూడా త్వరలోనే సాధ్యమవుతుంది". కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు.

    గత నెల 12 నాటికి 37 లక్షలుగా ఉన్న రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి ఈ నెల 4వ తేదీ నాటికి 1.05 కోట్లకు చేరింది.
 
    డిమాండ్‌లో పెరుగుదల దృష్ట్యా, రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్య కూడా పెరిగింది. గత నెల 12 నాటికి 20గా ఉన్న సంఖ్య ఈ నెల 4వ తేదీ నాటికి 57కు చేరింది.
 
    కరోనాపై నిరంతర పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.

 

***



(Release ID: 1715920) Visitor Counter : 193