ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ రాజన్ మిశ్ర కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 APR 2021 8:41PM by PIB Hyderabad

పండిత్ రాజన్ మిశ్ర కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘శాస్త్రీయ గాన లోకం లో పండిత్ రాజన్ మిశ్ర ఒక చెరిగిపోనటువంటి ముద్ర ను వదలి వెళ్లారు.  బనారస్ ఘరానా తో ముడిపడ్డ మిశ్ర గారి నిష్క్రమణ కళా జగతి కే కాక సంగీత ప్రపంచానికి కూడా తీరని లోటు’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  ఈ శోక భరిత ఘడియ లో పండిత్ రాజన్ మిశ్ర కుటుంబానికి, అభిమానుల కు ప్రధాన మంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

 

***
 


(రిలీజ్ ఐడి: 1714024) సందర్శకుల సూచీ సంఖ్య : : 196