ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన కమాను నిర్మాణం పూర్తిపై ప్రధాని ప్రశంస

Posted On: 05 APR 2021 7:50PM by PIB Hyderabad

   జమ్ముక‌శ్మీర్‌ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన‌ రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.

 

***



(Release ID: 1709740) Visitor Counter : 199