ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కరోనా కొత్త కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా 6.3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు

Posted On: 31 MAR 2021 12:12PM by PIB Hyderabad

ఎనిమిది రాష్ట్రాలలో - మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్ లలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 53,480 కరోనా కేసులు నమోదుకాగా అందులో 84.73%  కేవలం ఈ 8 రాష్ట్రాలకు చెందినవే.  మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 27,918 కేసులు, చత్తీస్ గఢ్ లో 3,108, కర్నాటకలో  2,975 కేసులు వచ్చాయి.

 

కేసులు పెరుగుతున్న పది రాష్ట్రాల పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంది.  

 

 

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 5,52,566 కు చేరింది. ఇది దేశంలో నమోదైన పాజిటివ్ కేసులలో 4.55%. గత 24 గంటలలో నికరంగా పెరిగిన చికిత్సలోని కేసులు 11,846. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, పంజాబ్, చత్తీస్ గఢ్ అనే ఐదు రాష్టాలలోనే 79.30% చికిత్సలో ఉన్న కేసులున్నాయి. ఇందులో 61% తో మహారాష్ట్ర ముందంజలో ఉంది.  

 

మరోవైపు దేశవ్యాప్తంగా 10,46,757 శిబిరాల ద్వారా ఈరోజు ఉదయం 7 గంటలవరకు 6,30,54,353 కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో  82,16,239 అరోగ్య సిబ్బంది మొదటి డోసులు, 52,19,525 ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 90,48,417  కోవిడ్ యోధుల మొదటి డోసులు, 37,90,467 కోవిడ్ యోధుల రెండో డోసులు, 73,52,957 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల మొదటి డోసులు,  6,824 రెండో డోసులు, 2,93,71,422 60 ఏళ్ళు పైబడ్డవారి మొదటి డోసులు, 48,502 రెండో డోసులు కలిసి ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళమధ్య  దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

82,16,239

52,19,525

90,48,417

37,90,467

73,52,957

6,824

2,93,71,422

48,502

6,30,54,353

 

టీకాల కార్యక్రమం మొదలైన 74వ రోజైన మార్చి 30న 19,40,999  టీకాలిచ్చారు. అందులో 17,77,637  మంది లబ్ధిదారులు 39,666 శిబిరాలద్వారా మొదటి డోస్ అందుకున్నవారు కాగా  1,63,632 మంది రెండో డోస్ అందుకున్నవారు..

తేదీ: మార్చి 30, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళమధ్య  దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

41,323

30,778

1,03,675

79,246

4,80,474

6,419

11,52,165

46,919

17,77,637

1,63,362

 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినపది కోలుకున్నవారు 1,14,34,301. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  94.11%. గత 24 గంటలలో 41,280  మంది కోలుకున్నారు.

గడిచిన 24 గంటలలో 354 కోవిడ్ మరణాలు సంభవించాయి. అందులో 82.20%  మరణాలు ఆరు రాష్ట్రాలకు చెందినవే. మహారాష్ట్రలో అత్యధికంగా 139 మరణాలు నమోదుకాగా పంజాబ్ లో 64 మంది చనిపోయారు. .

 

గడిచిన 24 గంటలలో పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: రాజస్థా, అస్సాం, ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షదీవులు, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్

 

***



(Release ID: 1708750) Visitor Counter : 212