ప్రధాన మంత్రి కార్యాలయం

కీర్తి శేషులు బీజూ ప‌ట్నాయ‌క్ జ‌యంతి సంద‌ర్భం లో ఆయ‌న‌ కు న‌మ‌స్సులు అర్పించిన ప్రధాన మంత్రి‌

Posted On: 05 MAR 2021 10:42AM by PIB Hyderabad

కీర్తి శేషులు బీజూ ప‌ట్నాయ‌క్ జ‌యంతి నాడు ఆయ‌న‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్సులు అర్పించారు.

‘‘శ్రీ బీజూ బాబు జ‌యంతి నాడు ఆయన కు ఇదే నా శ్ర‌ద్ధాంజ‌లి.  భార‌త‌దేశం భవిష్యత్తు ఎలా ఉండాలి అనే అంశం లో ఆయ‌న కు గల దృష్టికోణం, మాన‌వ సాధికారిత ప‌ట్ల, సామాజిక న్యాయం ప‌ట్ల ఆయ‌న కు గల తపన మ‌నకంద‌రికీ ప్రేర‌ణ‌ ను అందించేవే.  ఒడిశా ప్ర‌గ‌తి కోసం ఆయ‌న చేసిన కృషి ని చూసుకొని దేశ ప్ర‌జ‌లు గ‌ర్విస్తున్నారు’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***
 

 


(Release ID: 1702633)