ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 టీకామందు ఒకటో డోసు ను తీసుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 01 MAR 2021 7:49AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం నాడు, అంటే మార్చి ఒకటో తేదీ న, న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎమ్ ఎస్ లో కోవిడ్-19 టీకామందు తాలూకు ఒకటో డోసు ను వేయించుకొన్నారు.

‘‘ఎఐఐఎమ్ఎస్ లో నేను కోవిడ్-19 టీకామందు తొలి డోసు ను వేయించుకొన్నాను.   కోవిడ్-19 కి వ్యతిరేకం గా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నటువంటి పోరాటాన్ని  బలపరచడానికి మన శాస్త్రవేత్త లు, వైద్యులు అతి తక్కువ కాలం లోనే చేసిన కృషి ప్రశంసాయోగ్యమైంది.  టీకామందు ను వేయించుకోవలసిందిగా అర్హులైన వారందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  కలసికట్టుగా మనం అందరం కోవిడ్-19కి తావు ఉండనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరిద్దాం’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***



(Release ID: 1701617) Visitor Counter : 246