ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోటి కోవిడ్ టీకాల మైలురాయి దాటిన భారత్

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణమూ

నమోదు కాని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

Posted On: 19 FEB 2021 2:12PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. 2021 ఫిబ్రవరి 19వతేదీ ఉదయం 8 గంటలకల్లా దేశవ్యాప్తంగా అందించిన కోవిడ్ డోసులు కోటి దాటాయి. టీకాలు అందుకున్నవారిలో ఆరోగ్య సిబ్బందితోబాటు కోవిడ్ యోధులున్నారు. కోటి టీకాల మైలురాయి దాటటానికి భారత్ కు 34 రోజులు పట్టింది. ఈ వేగంలో భారత్ కు ప్రపంచంలో రెండో స్థానం దక్కినట్టయింది.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QGGE.jpg

మొత్తం2,11,462 శిబిరాల ద్వారా 1,01,88,007 టీకాల డోసుల పంపిణీ జరిగినట్టు ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారం నిర్థారించింది.   వీరిలో  62,60,242 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది,  6,10,899 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా 33,16,866 మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు. రెండవ డోస్ ఈ నెల 13 న ప్రారంభం కాగా మొదటి డోస్ వేయిమ్చుకొని 28 రోజులు పూర్తయిన వారందరూ దీనికి అర్హులు. కోవిడ్ యోధులకోసం మొదటి డోస్ ఫిబ్రవరి 2న మొదలైంది.

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

మొదటి డోస్

రెండవ డోస్

మొత్తం డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

4,347

495

4,842

2

ఆంధ్రప్రదేశ్

3,86,770

51,996

4,38,766

 3

అరుణాచల్ ప్రదేశ్

18,359

2,941

21,300

4

ఆస్సాం

1,38,795

7,953

1,46,748

5

బీహార్

5,06,688

33,419

5,40,107

6

చండీగఢ్

11,381

423

11,804

7

చత్తీస్ గఢ్

3,21,706

14,425

3,36,131

8

దాద్రా, నాగర్ హవేలి

4,493

114

4,607

9

డామన్, డయ్యూ

1,640

94

1,734

10

ఢిల్లీ

2,49,791

11,188

2,60,979

11

గోవా

13,862

356

14,218

12

గుజరాత్

8,11,152

28,047

8,39,199

13

హర్యానా

2,03,766

16,500

2,20,266

14

హిమాచల్ ప్రదేశ్

90,908

68,031

1,58,939

15

జమ్మూ, కశ్మీర్

1,77,795

3,756

1,81,551

16

జార్ఖండ్

2,38,852

8,595

2,47,447

17

కర్నాటక

5,19,158

63,533

5,82,691

18

కేరళ

3,86,901

23,948

4,10,849

19

లద్దాఖ్

4,436

290

4,726

20

లక్షదీవులు

1,809

115

1,924

21

మధ్యప్రదేశ్

6,11,640

0

6,11,640

22

మహారాష్ట్ర

8,14,682

24,884

8,39,566

23

మణిపూర్

35,834

901

36,735

24

మేఘాలయ

21,674

607

22,281

25

మిజోరం

13,731

1,384

15,115

26

నాగాలాండ్

18,398

2,661

21,059

27

ఒడిశా

4,29,212

53,401

4,82,613

28

పుదుచ్చేరి

7,661

454

8,115

29

పంజాబ్

1,16,199

5,575

1,21,774

30

రాజస్థాన్

7,47,420

15,493

7,62,913

31

సిక్కిం

10,143

357

10,500

32

తమిళనాడు

3,09,692

20,125

3,29,817

33

తెలంగాణ

2,79,832

73,281

3,53,113

34

త్రిపుర

79,030

6,766

85,796

35

ఉత్తరప్రదేశ్

10,52,431

18,464

10,70,895

36

ఉత్తరాఖండ్

1,26,454

4,246

1,30,700

37

పశ్చిమ బెంగాల్

5,83,613

23,922

6,07,535

38

ఇతరములు

2,26,853

22,159

2,49,012

 

మొత్తం

95,77,108

6,10,899

1,01,88,007

 

టీకాల కార్యక్రమం మొదలైన 34వ రోజైన ఫిబ్రవరి 18న మొత్తం  6,58,674  టీకా డోసులు ఇచ్చారు. అందులో 4,16,942 మంది లబ్ధిదారులకు 10,812 శిబిరాల ద్వారా మొదటి డోస్ ఇవ్వగా వారిలో ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కూడా ఉన్నారు. 2,41,732మంది ఆరోహ్య సిబ్బంది రెండవ డోస్ టీకా అందుకున్నారు.  

రోజురోజుకూ దేశంలో కోవిడ్ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొత్తం టీకాలు తీసుకున్న వారిలో 57.47% వాటా ఎనిమిది రాష్ట్రాలదే. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా  10.5% వాటాతో  10,70,895 టీకా డోసులు పంపిణీ అయ్యాయి .

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EFBA.jpg

రెండవ డోస్ టీకాలలో 60.85%  7 రాష్ట్రాలలో ఇవ్వగా 12% వాటాతో ( 73,281 మంది లబ్ధిదారులతో) అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ముందంజలో ఉంది

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OZJJ.jpg

గత 24 గంటలలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో  ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.అవి: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, జార్ఖండ్, మేఘాలయ, పుదుచ్చేరి, చండీగఢ్, మణిపూర్, మిజోరం, లక్షదీవులు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, త్రిపుర, అండమాన్, నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.   15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1-5 మధ్య మరణాలు నమోదు కాగా, మూడు రాష్ట్రాలలో 6-10 మధ్య మరణాలు సంభవించాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004OVL7.jpg

భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా తగ్గుతూ ప్రస్తుతం 1,39,542 కి చేరింది.  ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.27% మాత్రమే.  ఇప్పటివరకు దేశమంతటా కోలుకున్న కోవిడ్ బాధితులు 1,06,67,741 మంది కాగా కోలుకున్నవారి శాతం 97.30%. గత 24 గంటలలో 10,896 మంది కోలుకున్నారు.   

కొత్తగా కోలుకున్నవారిలో 83.15% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  కేరళలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,193 మంది కోలుకోగా మహారాష్ట్రలో 2,543 మంది, తమిళనాడులో 470 మంది కోలుకున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LBGR.jpg

గత 24 గంటలలో కొత్తగా 13,193 కోవిడ్ పాజిటివ్ కే సులు నమొదయ్యాయి. వాటిలో 86.6%  కేవలం ఆరు రాష్టాలవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 5,427 కేసులు, కేరళలో 4,584, తమిళనాడులో 457 నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0068DFB.jpg

గత 24 గంటలలో 97 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందు లో 76.29% మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 38 మంది, ఆ తరువాత కేరళలో 14 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0078LQ3.jpg

 

****



(Release ID: 1699378) Visitor Counter : 157