ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అత్యంత వేగంగా 18 రోజుల్లో 40 లక్షల టీకాలకు చేరిన భారత్

మొత్తం కోవిడ్ కేసుల్లో చికిత్సలో ఉన్నవారు 1.5 శాతానికి తగ్గుదల
గత 24 గంటల్లో ఒక్క మరణమూ నమోదు కాని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

Posted On: 03 FEB 2021 11:38AM by PIB Hyderabad

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మీద పోరులో భారత్ అనేక మైలురాళ్ళు అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. టీకాలు ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే 40 లక్షల టీకాలు పూర్తి చేయటం కూడా ఒక రికార్డు. భారత్ దీన్ని కేవలం 18 రోజుల్లో సాధించగలిగింది.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DB9L.jpg

ప్రజలకు టీకాలు ఇవ్వటంలో భారతదేశం 2021 ఫిబ్రవరి 1 నాటికి అంతర్జాతీయంగా మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా ఉంది. ఇదే వేగాన్ని భారత్ కొనసాగిస్తోంది.

 

మిగిలిన అంశాల్లో కూడా భారత్ కోవిడ్ మీద తన యుద్ధాన్ని ప్రకటించింది.  గత 24 గంటలలో  14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అవి అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా, నాగర్ హవేలి, డయ్యూ డామన్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, లక్షదీవులు, లద్దాఖ్, సిక్కిం, మణిపూర్, పుదుచ్చేరి, గోవా, ఒడిశా, అస్సాం.  కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం, మరణాలు బాగా తగ్గుముఖం పట్టటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గింది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 1,60,057 కి తగ్గింది. మొత్తం కేసుల్లోంచి వారి వాటా 1.49 శాతానికి చేరింది.

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C422.jpg

 

గత 24 గంటలలో కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారి సంఖ్య 11,039  కాగా కొత్తగా కోలుకున్నవారిసంఖ్య 14,225. దీంతో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  3,296 తగ్గింది. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,62,631. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 97.08% కావటం అంతర్జాతీయంగా అత్యధికం. చికిత్సలో ఉన్నవారికీ, కొలుకున్నవారికీ మధ్య తేడా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 1,03,02,574.  అయింది. 31 రాష్టాలు, కేండ్ర పాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5,000 కంటే తక్కువ నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UH6B.jpg

 

8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారపు సగటు పాజిటివ్ నిష్పత్తి  జాతీయ సగటు 1.91% కంటే ఎక్కువ ఉంది. కేరళలో అత్యధికంగా 12% నమోదుకాగా చత్తీస్ గఢ్ లో 7% నమోదైంది.

 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L3F7.jpg

2021 ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 8 గంటలకు 41 లక్షలకు పైగా  (41,38,918) లబ్ధిదారులు కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.  

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2,727

2

ఆంధ్రప్రదేశ్

1,87,252

3

అరుణాచల్ ప్రదేశ్

9,791

4

ఆస్సాం

42,435

5

బీహార్

2,22,153

6

చండీగఢ్

4,019

7

చత్తీస్ గఢ్

79,676

8

దాద్రా నాగర్ హవేలి

867

9

డామన్, డయ్యూ

469

10

ఢిల్లీ

74,068

11

గోవా

5,422

12

గుజరాత్

2,87,852

13

హర్యానా

1,27,893

14

హిమాచల్ ప్రదేశ్

39,570

15

జమ్మూ, కశ్మీర్

26,634

16

జార్ఖండ్

55,671

17

కర్నాటక

3,16,368

18

కేరళ

2,24,846

19

లద్దాఖ్

1,234

20

లక్షదీవులు

807

21

మధ్య ప్రదేశ్

2,98,376

22

మహారాష్ట్ర

3,18,744

23

మణిపూర్

4,739

24

మేఘాలయ

4,694

25

మిజోరం

9,932

26

నాగాలాండ్

4,093

27

ఒడిశా

2,08,205

28

పుదుచ్చేరి

3,077

29

పంజాబ్

61,381

30

రాజస్థాన్

3,39,218

31

సిక్కిం

2,647

32

తమిళనాడు

1,20,745

33

తెలంగాణ

1,70,043

34

త్రిపుర

32,196

35

ఉత్తరప్రదేశ్

4,63,793

36

ఉత్తరాఖండ్

43,430

37

పశ్చిమ బెంగాల్

2,88,245

38

ఇతరములు

55,606

                                   మొత్తం

41,38,918

 

గత 24 గంటలలో 1,88,762 మంది ఆరోగ్య సిబ్బంది 3845 శిబిరాలలో టీకాలు వేయించుకున్నారు. ఇప్పటిదాకా 76,576 కోవిడ్ టీకా శిబిరాలు నిర్వహించారు. టీకాల లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QB6K.jpg

కొత్తగా గత 24 గంటలలో కోలుకున్నవారిలో 85.62% మంది కేవలం 8 రాష్టాలకు చెందినవారే. కేరళలో అత్యధికంగా 5747 కేసులు రాగా మహారాష్ట్రలో 4011, తమిళనాడు లో 521 నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006JHW2.jpg

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 83.01% కేవలం 6 రాష్ట్రాలకు చెందినవే. కేరళలో అత్యధికంగా 5,716 కేసులు రాగా మహారాష్ట్రలో 1,927, తమిళనాడులో 510 నమోదయ్యాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007EQ6R.jpg

 

గత 24 గంటలలో 110 కోవిడ్ మరణాలు నమొదయ్యాయి.  ఇందులో 66.35% ఐదు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న 30 మంది మరణించగా, ఆ తరువాత స్థానంలో కేరళ (16) ఉంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008VBJ7.jpg

***



(Release ID: 1694752) Visitor Counter : 204